![]() |
నితీష్ కుమార్ |
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు నిరాకరించటమే కాకుండా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బి.జే.పి. తరపున ప్రధానమంత్రిగా ప్రతిపాదించే వ్యక్తి "సెక్యులర్" వాది అయి ఉండాలని అనవసరమైన, అసందర్భ ప్రకటనను విడుదల చేశారు. రెండు సంవత్సరాల తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల గురించి, 185 పార్లమెంటు స్థానాలున్న భా.జ.పా. పార్టీకి సరిగ్గా 20 స్థానాలు కూడా లేని జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ షరతులు విధించడం విడ్డూరమే. భా.జ.పా. అండతో పైకెదిగి భా.జ.పా.కే షరతులు విధించడం ఇంకా విచిత్రం. బీహార్ లో నితీష్ కుమార్ సెక్యులర్ నాయకుడుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి భా.జ.పా.ను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయాలనుకొంటున్నట్లున్నది.
![]() |
శ్రీ మోహన్ భాగవత్ |
పై విషయం జాతీయ రాజకీయాలలో ఒక సంచలనమైన చర్చను తెర పైకి తెచ్చింది.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్.డి.ఏ. భాగస్వామ్య పక్షమైన జనతాదళ్(ఎస్) నాయకుడు నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. అభ్యర్థిని వ్యతిరేకించగా యు.పి.ఏ. పక్షంలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ యు.పి.ఏ. ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించడం ఆసక్తికరం.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో నూతన రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఈ నూతన సమీకరణాల స్పష్టతకు ఇంకా కొద్ది రోజులు వేచి చూడవలసిందే.
- పతికి